మునిపల్లి : సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలోని రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయికుమార్, అల్లం నవాజ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రైతుల పాలిట దేవుడిగా సీఎం కేసీఆర్ నిలిశారని కొనియాడారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు రమేశ్, వీరన్నాపాటిల్, విశ్వనథంపాటిల్, ఎంపీటీసీ రాజశేఖర్, మాజీ ఎంపీపీ చంద్రయ్య, నాయకులు , వెంకట్రాములు, నారాయణ, భాస్కర్, నర్సింలు, గరిబోద్దిన్, మల్లేశం, నవీన్, పరశురాం, మోహన్ తదితరులు ఉన్నారు.