అందోల్/సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళిత బంధు పతకం ఎంతో గొప్పదని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం అందోల్ల క్ష్మీ నర్సింహ గార్డెన్ లో జరిగిన దళిత బంధు అవగాహన సదస్సు కార్యకమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.
అంతకు ముందు అందోల్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు ద్వారా దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చాలని సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గొప్ప పథకం అన్నారు.
దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి దళితుడి జీవితం మారుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ఈ పథకం ఫలితాలు ప్రతి ఒక్కరికి చేరుతాయన్నారు. దళితులకు వచ్చే ప్రయోజనాలకు తూట్లు పొడవటానికి, ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.