పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ప్రభుత్వపథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామారాజు,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, సర్పంచ్లు అలుగుల సత్యనారాయణ, నరేష్, ఉదయశ్రీ సూర్య ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.