సంగారెడ్డి : కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రాగానే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగానే కారు దగ్ధమైనట్లు భావిస్తున్నారు.