సంగారెడ్డి : బైకు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి మైలురాయిని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా కొల్చారం మండలం రంగంపేట వద్ద ఇవాళ రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స జోగిపేట దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.