ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమీ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హజరై మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు మొక్కలు నాటడం పూర్తి చేసి 26న మొక్క లు నాటిన కూలీలకు వేతనం అందించాలన్నారు. డెంగ్యూ వ్యాది ప్రబలకుండా ప్రజలకు సూచనలు చేయాలన్నారు.
ప్రతి శుక్రవారం గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన చేయడమే కాకుండా ప్రతి శుక్రవారం ట్యాంక్లు శుభ్రం చేసి అందులో బ్లీచిం గ్ పౌండర్ వేయాలన్నారు. ప్రతి నర్సరీలో 300 వందల చెట్లను పెద్ద బ్యాగులో మొక్కలు నాట్టి వచ్చే సంవత్సరానికి నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. కొత్తగా మంజూరైన జాబ్ కార్డులను కూలీలకు అందించాలన్నారు. చెట్లు పెంచడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో ఎపీడీ జయదేవులు,ఎపీవో రాజ్కుమార్, ఎంపీవో లక్ష్మయ్య, సూపరిడెంట్ మారుతీ విఠోభ ఆయా కార్యదర్శులు, ఉపాధి హమీ సిబ్బంది ఉన్నారు.