నారాయణఖేడ్ : నిరుపేదల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక ర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదవశాత్తు, ఇతర అనారోగ్య సమస్యలతో దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ మాజీద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.