రాయికోడ్/సంగారెడ్డి : బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాయికోడ్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజు పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, మండల టీఆర్ఎస్ కార్యదర్శి శంకర్, ఎంపీటీసీ నిరంజన్, నాయకులు మారుతి, శంకర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
నారాయణఖేడ్లో..
బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిన సందర్భంగా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.