సంగారెడ్డి మున్సిపాలిటీ: రాష్ట్రంలోని నిరుపేద దళితులకు, దళిత ఉద్యోగస్తులకు దళితబంధు వర్తింప చేయడాన్ని పురస్కరించుకుని జిల్లా టీఎన్జీవోల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16వ జరిగిన హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద దళితులకు, దళిత ఉద్యోగస్తులకు దళితబంధును ప్రకటించినందుకు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సుశీల్బాబు అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి యం.నర్సింలు, కేంద్ర సంఘం కార్యదర్శి రవి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా కోశాధికారి కసిని శ్రీకాంత్, టీహెచ్డబ్ల్యూవో రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హష్మి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రాథోడ్ నిర్మల రాజకుమారి, పట్టణ శాఖ అధ్య క్షుడు శ్రీనివాస్, కార్యదర్శి భాస్కర్, జోగిపేట-అందోల్ అధ్యక్షుడు మల్లిఖార్జున్, కార్యదర్శి సుభాశ్, శ్రీనివాస్, ఆంజనేయులు, నర్సింలు, వెంకటేశం, మహేశ్, రామ ప్ప, ఆసిఫ్, షకీల్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.