దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదు
ఈటలతో పాటు ఆయన బావమరిది క్షేమాపణలు చెప్పాలి
లేనిపక్షంలో ఆందోళనలుఉధృతం
అనుచిత వ్యాఖ్యలపై దళితనేతల ఆగ్రహం
జోగిపేటలో దళిత నాయకులు ధర్నా
అందోల్, జూలై 29 : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు దళిత నేతలు డిమాండ్ చేశారు. దళితులపై ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం జోగిపేట పట్టణంలో సంగారెడ్డి ప్రధాన రహదారిపై పార్టీశ్రేణులు, దళిత నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. దళిత కుటుంబాలు మరింత ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో దళితబంధు తీసుకొచ్చిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శించడంతోపాటు ప్రభుత్వానికి అండగా ఉంటున్న దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈ విషయంలో ఈటలతో పాటు ఆయన బావమరిది దళితులకు క్షేమాపణలు చెప్పాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, కో-ఆప్షన్ సభ్యుడు ఫైజల్, కౌన్సిలర్లు దుర్గేశ్, చెందర్నాయక్, నాయకులు లక్ష్మణ్, షకీల్, సంతోష్, వాజిద్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.