ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి,
ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి
తూప్రాన్ రూరల్, జూలై, 29 : పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లు, ఇండ్ల పరిసరాల్లో మొక్కలను నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. తూప్రాన్లో గురువారం మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, మైనార్టీ నాయకులతో కలిసి ఈద్గా మైదానంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలను నాటి సంరక్షించడం కోసం పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. 7 విడుతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల మొక్కలను నాటామన్నారు. హరితహారంలో మొక్కల పెంపకాన్ని చేపట్టడంతో పట్టణాల్లో అర్బన్ పార్కులు, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, అటవీ ప్రాంతాలు మొక్కలతో కళకళలాడుతున్నాయన్నారు. ప్రజలు నచ్చిన మొక్కలను అడిగితే ఇండ్లకు పంపిణీ చేస్తామన్నారు. వారి వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్ , కుమ్మరి రఘుపతి, మామిండ్ల జ్యోతికృష్ణ, తలారి మల్లేశ్, ఉమాసత్యలింగం, అరుణావెంకట్గౌడ్, మామిడివెంకటేశ్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అజార్, సత్తార్, రబ్బానీ, ఉమర్, ఫారూఖ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..
తూప్రాన్ ఈద్గామైదానంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి మొక్కలను నాటిన అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా పాల్గొంటూ తమ సేవలను అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ పథకాల్లో అందరికి ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు
ఆరో వార్డులో మొక్కలు అందజేత
రామాయంపేట, జూలై 29: రామాయంపేట పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్ యాదగిరి ఇంటికీ ఆరు మొక్కలను అందజేశారు. అనంతరం వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ ఇంటి ఎదుట పెరట్లో పూలు, పండ్ల మొక్కలను నాటాలనే ప్రభుత్వం ఉచితంగా మొక్కలను అందజేస్తున్నాదన్నా రు. మొక్కలను నాటి కాపాడాలన్నారు. మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ సహకారంతో ఆరో వార్డును స్వచ్ఛవార్డుగా తయారు చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.