రాయికోడ్ : రాయికోడ్ ముత్యాల వాడలో ఉన్న ముమ్మా దేవి ఆలయానికి టీఆర్ఎస్ నాయకులు రాయికోడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, గాండ్ల శివకుమార్, చెన్నురి శివ కలిసి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 3కిలోల వెండి బహూకరించారు.
అనంతరం యేసయ్య మాట్లాడుతూ.. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య, చందు, నాయకులు సతీష్ పంతులు ఉన్నారు.