రామగుండం కమిషనర్గా చంద్రశేఖర్కు పోస్టింగ్
ఐదేండ్ల కాలంలో ఎస్పీగా తనదైన ముద్ర
సంగారెడ్డి ఎస్పీగా ఉండగానే డీఐజీగా పదోన్నతి
జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చింది : చంద్రశేఖర్రెడ్డి
సంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి బదిలీ అయ్యారు. రామగుండం కమిషనర్గా చంద్రశేఖర్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు నూతన ఎస్పీగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణకుమార్ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రశేఖరెడ్డి ఐదేళ్లపాటు సంగారెడ్డి ఎస్పీగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీగా చంద్రశేఖర్రెడ్డి 23 మే, 2016లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చంద్రశేఖర్రెడ్డి కొనసాగుతున్నారు. ఐదేళ్లపాటు ఎస్పీగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించారు. సంగారెడ్డి ఎస్పీగా ఉన్న క్రమంలోనే చంద్రశేఖర్రెడ్డి డీఐజీగా పదోన్నతి పొందారు. 4 జనవరి, 2019లో డీఐజీగా పదోన్నతి లభించింది. ఎస్పీగా ఆయన పాలనలో జిల్లాలో అన్నిరకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. మహిళలపై దాడులు, ఈవ్టీజింగ్ తగ్గేందుకు భరోసా కేంద్రాలు, షీటీమ్స్ ద్వారా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి కృషి చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. 2018లో సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం జరిగేలా చూశారు. అలాగే 2019లో జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఆ తర్వాత జరిగి జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. కొవిడ్ సమయంలో జిల్లాలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలయ్యేలా చూశారు. ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి స్వయంగా జిల్లా అంతటా కలియతిరుగుతూ లాక్డౌన్ విజయవంతం అయ్యేలా చూశారు. కరోనాకు గురైన పోలీసు సిబ్బందికి సకాలంలో చికిత్స అందేలా చొరవ తీసుకుని సిబ్బంది మన్ననలు పొందారు. ఇదిలా ఉంటే ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి వచ్చే ఏడాది జనవరిలో ఐజీగా పదోన్నతి పొందనున్నట్లు సమాచారం.
జిల్లాలో పనిచేయటం సంతృప్తినిచ్చింది..