ఉమ్మడి మెదక్ ప్రధాన న్యాయమూర్తి అంగీకారం
తెలుగుకు ప్రాధాన్యంపై సర్వత్రా హర్షం
సంగారెడ్డి, జూలై 28 : న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు కేసుల విచారణ ఇంగ్లిష్లో జరుగుతున్న విషయం తెలిసిందేనని, ఇక నుంచి తెలుగులో విచారణ చేసేందుకు వేణుగోపాల్రావు వేసిన బెయిల్ అర్జీని విచారణకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం న్యాయవాది సమర్పించిన బెయిల్ అర్జీని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అంగీకరించి, స్థానిక 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి కుటుంబ న్యాయస్థానానికి పంపడంతో తెలుగులో విచారణకు మార్గం సుగమమైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. తెలుగు భాషలో తీర్పులు రావాలని, సామాన్యుడికి అర్థమయ్యే భాషా వినియోగంతో స్పష్టమైన వాదోపవాదాలు తీర్పులకు అవకాశం ఉంటుందని కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్లో తెలుగుకు ప్రాధాన్యం క్రమంలో కేసుల విచారణకు అంగీకరిస్తే కోర్టు తీర్పులతో లాభం కలుగుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా, తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వచ్చే నెల 3 నుంచి ఉమ్మడి జిల్లా లీగ్ పోటీలు
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 28 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల (ఆగస్టు) 3 నుంచి అండర్ 23 రెండో రోజు లీగ్ పోటీలు ప్రారంభం కానున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 23 జుట్టు ఎంపిక ఈ నెల 30న సంగారెడ్డిలోని బీఆర్ అంబేద్కర్ మైదానంలో ఉద యం 10 గంటలకు నిర్వహించనున్నుట్లు ఆయన వెల్లడించారు. క్రీడాకారులు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ ఆధార్ కార్డు, పుట్టిన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని ఆయన కోరారు.