ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రూ.1.58 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం
వట్పల్లి, జూలై 21 : ప్రజల అవసరాలను గుర్తించి… వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండల కేంద్రం వట్పల్లి నుంచి దుద్యాల వరకు రూ. 1.58 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుధవారం వట్పల్లిలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, దీంతో ఏడేండ్ల కాలంలో మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు నిర్మించడంతో రవాణా వ్యవస్థను మెరుగుపడిందన్నారు. వట్పల్లి నుంచి దుద్యాల మీదుగా రేగోడ్కు ప్రతీ రోజూ ఎంతో మంది రాకపోకలు సాగిస్తారని, కానీ రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వారి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులతో పలుమార్లు మాట్లాడి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ప్రయాణాలు సాఫీగా సాగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, ఎంపీపీ కృష్ణవేణి, రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వినోద్గౌడ్, వరం చైర్మన్ వీరారెడ్డి, సర్పంచులు సురేఖబుద్దిరెడ్డి, శంకరప్ప, దీప్లానాయక్, ఎంపీటీసీ ఇందిరారాజేందర్, ఉప సర్పంచ్ సాయిలు, వార్డు సభ్యులు అబేద్, ప్రకాశం, మహేందర్గౌడ్, పీఆర్ ఈఈ జగదీశ్వర్, పీఆర్ డీఈ రామారావు, .జేఈ రాకేశ్, కాంట్రాక్టర్ నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు.
పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
అందోల్, జూలై 21: జోగిపేట పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనిల్రాజ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బుధవారం పరామర్శించారు. అనిల్రాజ్ తండ్రి చంద్రమౌళి అనారోగ్యంతో మృతిచెందడంతో స్థానిక నేతలతో కలిసి అనిల్రాజ్ ఇం టికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్గుప్తా, మాజీ చైర్మన్ నారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్ చందర్నాయక్, కో-ఆప్షన్ సభ్యుడు ఫైజల్, నాయకులు లక్ష్మణ్, ఖాజాపాషా, అర్పత్, షకీల్, మాహేశ్యాదవ్, నాగరాజ్, ఇమ్రాన్ తదితరులున్నారు.