టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరో నటించిన నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సందడి చేయబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను సురేశ్ బాబు ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించారు. నారప్ప అమెజాన్ ప్రైమ్లో జులై 20న విడుదల కాబోతుంది. దృశ్యం 2 కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే వెంకీ రెండు ప్రాజెక్టులు ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకున్నాయనే దానిపై ఓ న్యూస్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
నారప్పను అమెజాన్ కు రూ.40 కోట్లకు అమ్మేశారట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా నిర్మాతలు అదనంగా కొంత డబ్బును పొందనున్నారని టాక్. మరోవైపు దృశ్యం 2ను డిస్నీ + హాట్ స్టార్స్ శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్ ఓటీటీ రైట్స్ ను రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అంటే వెంకీ రెండు చిత్రాలు రూ.75 కోట్ల డీల్ సెట్ చేశాయన్నమాట. కోవిడ్ పరిస్థితుల్లో కూడా వెంకీ మార్కెట్ విషయంలో తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడంటున్నారు సినీ జనాలు.
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
తేజ్ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి