బండ్లగూడ, జూలై 11 : మానవాళి మనుగడకు మొక్కలు కీలకమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. ఆదివారం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణంలో సమతుల్యం ఏర్పడి వర్షాలు విరివిగా కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ విధిగా తమ ఇండ్లతో పాటు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు.
ప్రజలు అవసరమైన మొక్కలను అధికారుల ద్వారా తీసుకోవాలన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందన్నారు. పది రోజులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, శివరాంపల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీ, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో చాలా వరకు మొక్కలను నాటామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు రవీందర్, సంతోషి రాజ్రెడ్డి, రవీందర్రెడ్డి, నాయకులు వెంకటేశ్, పాపయ్య యాదవ్, రాందాస్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, రావులకోళ్ల నాగరాజు, పాండు, సంగీతం దశరథ్, సుమన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.