మెదక్ మున్సిపాలిటీ, జూలై 9: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చి మెదక్ను స్వచ్ఛ పట్టణంగా మార్చుదామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 9వ రోజు శుక్రవారం 4, 7, 8, 26 వార్డుల్లో ప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం ఆయా వార్డు కౌన్సిలల్ నర్మదాయాదవ్, శంసున్నిషా బేగం, జయశ్రీ, గడ్డమీది యశోదతో కలిసి మొక్కలు నాటి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్దేశ్వరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, టీపీఎస్ లక్ష్మీపతి, వర్క్ ఇన్స్పెక్టర్లు సలీ, నితిన్, దుర్గాపతి, టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణగౌడ్, శ్రీధర్యాదవ్, దుర్గాప్రసాద్లతోపాటు మెప్మా మహిళలు, వార్డుల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన డీఈవో
మెదక్ మున్సిపాలిటీ, జూలై 9 : జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, మండల విద్యాధికారి నీలకంఠం, గురుకుల ఉపాధ్యాయురాళ్లతో కలిసి మొక్కలు నాటారు.
చిన్నశంకరంపేట, జూలై 9 : మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీవో గిరిధర్రెడ్డి పరిశీలించారు. సంబంధిత గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మెదక్ రూరల్, జూలై 9: గ్రామాలను అభివృద్ధి చేయడమే పల్లెప్రగతి లక్ష్యమని పల్లెప్రగతి ప్రత్యేకాధికారి గౌతమి అన్నారు. శుక్రవారం పల్లెప్రగతిలో భాగంగా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి సర్పంచ్ ప్రభాకర్, రాజ్పల్లి సర్పంచ్ ప్రేమలత, ఆయా గ్రామాల సర్పంచ్లు, పల్లెప్రగతి ప్రత్యేకాధికారులు గ్రామ సభలు నిర్వహించారు అనంతరం రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను, కలుపుమొక్కలను తొలిగించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్, లక్ష్మణ్, ఉపసర్పంచ్ సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్రెడ్డి ఉన్నారు.
మెదక్ రూరల్, జూలై 9 : పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నదని జడ్పీ సీఈవో శైలశ్ అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ మండల పరిధిలోని పాతూరు గ్రామంలో జడ్పీ సీఈవో శైలశ్, రమాకాంత్, ఎంపీడీవో శ్రీరాములు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్యార్డు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎంపీపీ నయీం, సర్పంచ్ లింగమ్మ, పంచాయతీ కార్యదర్శి, నాగరాజ్, టీఆర్ఎస్ నాయకులు బాలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాపన్నపేట, జూలై 9: పాఠశాలను హరితపాఠశాలగా మార్చడానికి ప్రతిఒక్కరూ తమవంతు సహకారం అందించాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సూచించారు. ఈ మేరకు గాంధారిపల్లి ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శోభారాణి వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎ. మోహన్రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట, జూలై 9: నిజాంపేట మం డలం నార్లాపూర్ గ్రామంలో చేపడుతున్న హరితహారం, పల్లెప్రగతి పనులను డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పర్యటించి పరిశీలించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి అమరసేనారెడ్డి, ఏపీవో శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు
మండలంలోని నస్కల్ గ్రామంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామ ప్రధాన రహదారిలో నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. వెంకటాపూర్(కే)లో సర్పంచ్ అనిల్కుమార్ స్థానిక పాఠశాలలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బోధన సిబ్బందితో కలిసి రాంపూర్ సర్పంచ్ రజిత మొక్కలు నాటారు.
మనోహరాబాద్, జూలై 9 : మండలంలోని లింగారెడ్డిపేటలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటికి ఐదు మొక్కలు చొప్పున పంపిణీ చేశారు. కాళ్లకల్లో ఇన్చార్జి సర్పంచ్ కాళిదాస్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. కొనాయిపల్లి పీటీలో సర్పంచ్ ప్రభావతి మొక్కలను అందజేశారు. నాయకుడు సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, ఎంపీటీసీ నత్తి లావణ్య, నాయకులు పెంటాగౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
చేగుంట, నార్సింగి మండలంలోని వల్లూర్లో నిర్వహించిన గ్రామ సభలో ఎంపీపీ చిందం సబిత, నార్సింగిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం అశోక్, జప్తి శివునూర్లో నిర్వహించిన గ్రామసభలో వైస్ ఎంపీపీ దొబ్బల సజాత, చేగుంట గ్రామసభలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ పాల్గొన్నారు.
వెల్దుర్తి, జూలై 9: పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం డ్రై డేను నిర్వహించగా.. గ్రామాల్లో కార్యదర్శులు, అంగన్వాడీలు, ప్రజాప్రతినిధులు వీధుల్లో తిరుగుతూ నీటి నిల్వలను తొలగించి ప్రజలకు అవగాహన కల్పించారు.