తిరువనంతపురం : కేరళలోని ఓ జూలో ఇటీవల పాము కాటుకు జూకీపర్ మృతిచెందిన విషయం తెలిసిందే. జూకీపర్ హర్షద్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. దీంట్లో 10 లక్షలు నగదు ఆ కుటుంబానికి అందజేయనున్నారు. జూలై ఒకటో తేదీన కేజ్ శుభ్రం చేస్తున్న సమయంలో ఓ నాగు పాము జూకీపర్ హర్షద్ను కాటేసింది. నష్టపరిహారంతో పాటు ఆ వ్యక్తి కుటుంబానికి ఓ ఇల్లు కట్టివ్వనున్నారు. హర్షద్ భార్యకు కూడా ఉద్యోగం ఇవ్వనున్నారు. జూకీపర్ పిల్లల చదువుల ఖర్చును కూడా 18 ఏళ్లు నిండేవరకు ప్రభుత్వమే భరించనున్నది. హర్షద్కు ఎటువంటి ప్రాపర్టీ లేని కారణంగా.. ప్రభుత్వమే అతని కుటుంబానికి లాడ్జింగ్ సౌకర్యం కల్పించనున్నది.