చైనా : చైనాను మలేరియా ఫ్రీ దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ప్రకటించింది. మలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు చైనాకు 70 ఏండ్లు పట్టింది. 1940లలో 30 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అయ్యేవి. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి చైనా మలేరియా కేసులు నమోదు కాలేదు. చైనా తీసుకున్న చర్యల వల్ల కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి చివరకు ఆ వ్యాధిని నిర్మూలించింది. మలేరియా రహిత దేశంగా చైనా అవతరించడంతో డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానామ్ గేబ్రియస్.. ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మలేరియా రహిత దేశాల జాబితాలో చైనా 40వ దేశంగా నిలిచింది.
అయితే మూడు సంవత్సరాలు వరుసగా మలేరియా కేసులు నమోదు కాకపోతే.. ఆ దేశం డబ్ల్యూహెచ్వోకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్ల్యూహెచ్వో పరిశోధన చేసి.. ఆ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తోంది. 2018లో ఉజెకిస్తాన్, పారాగూయి, 2019లో అల్జిరియా, అర్జెంటీనా, 2020లో ఈఐ సల్వాడర్ దేశాలు మలేరియా రహిత దేశాలుగా నిలిచాయి.