వనదుర్గకు సింగూరు జలాలు

జెన్కో ద్వారా 0.3టీఎంసీలు విడుదల
దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
పుల్కల్, జనవరి 26 : సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం (వనదుర్గా ప్రాజెక్టు) ఆయకట్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని వదిలినట్లు నీటిపారుదలశాఖ ఏఈ మహిపాల్రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు మూడు విడుతలుగా 9 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ నీరు జలవిద్యుత్ కేంద్రం ద్వారా వదులుతుండటంతో జెన్కో అధికారులు నీరు వదిలిన ప్రతిసారి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారని ఏఈ తెలిపారు. ఒకసారి వదిలిన నీరు ఘనపూర్ ఆయకుట్టు రైతులకు రెండు తడులకు సరిపోతుంది. ఇదిలా ఉండగా, ఘనపూర్ ఆయకట్టుకు నీరు విడిచిన ప్రతిసారి సింగూరు జలవిద్యుత్ కేంద్రంలో 0.4 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని జెన్కో ఏడీఈ పాండయ్య తెలిపారు. సింగూర్ నీరు విడుదల చేసి నందున మంజీరాతీరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
- కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పల్లా, వాణీదేవి లకు తొర్రూరు బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- కదులుతున్న బస్సులో మహిళా కానిస్టేబుల్కు వేధింపులు