పెద్దేముల్, జూన్ 17: గతంలో వర్షాకాలం వచ్చిందంటే పొలాలకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మీరు వేయించిన ఫార్మేషన్ రోడ్డుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి వస్తున్నామని పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన రైతు లు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో అన్నారు. గురువారం హైదరాబాద్లోని సునీతా రెడ్డి నివాసంలో స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పి. బల్వంత్రెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్కు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ షాక్లకు గురికా కుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కోరారు.అంతకు ముందు మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో మిగిలిన పనుల నిమిత్తం నిధులు కేటాయించాలని సునీతారెడ్డిని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు అనంతయ్య, బాలు, విద్యా కమిటీ చైర్మన్ అనంతయ్య పాల్గొన్నారు.