మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 16 : ప్రతి నాలాలో పూడికతీత పనులు చేపడుతామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పేర్కొన్నా రు. మున్సిపల్ పరిధిలోని సూర్యనారాయణ చెరువు నుంచి రాంపల్లి పరిధి వరకు, అన్నరాయిని చెరువు నుంచి చర్లపల్లి వరకు ఉన్న నాలాలో దాతల సహాయంతో చేపట్టిన పూడికతీత పనులను బుధవారం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాలాలు, మురుగు కాల్వలలో పూడికతీత పనులను చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు నాలాలు, మురుగు కాల్వలలో చెత్తను వేయరాదని సూచించారు. మున్సిపాలిటీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వాణి రెడ్డి, కౌన్సిలర్లు నగేశ్గౌడ్, సరిత,కళావతి, కో-ఆప్షన్ సభ్యులు అశోక్, అసిస్టెంట్ ఇంజినీర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.