జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ

సంగారెడ్డి టౌన్, జనవరి 16 : సంగారెడ్డిలోని ఐబీలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 నూతన సంవత్సర డైరీని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలోని సమస్యల పరిష్కారంతోపాటు సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ను ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇచ్చి అనంతరం జర్నలిస్టులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతావిజయేందర్రెడ్డి, సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సాయినాథ్, కృష్ణ, గౌరవ అధ్యక్షుడు విజయ్కుమార్, కోశాధికారి డేవిడ్ రాజ్, నాయకులు పుండరీకం, సంగమేశ్, నాగభూషణం, నర్సింహులు, బాలయ్య, నరహరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు