ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు
ఏజెన్సీలో వ్యాధుల నివారణకు చర్యలు
31 పీహెచ్సీలలో ఎపడమిక్ టీంలు
పల్లెపల్లెనా అవగాహన కార్యక్రమాలు
అందుబాటులో వైద్యులు, మందులు
ఆదిలాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాల్లో వానకాలం వచ్చిందంటే చాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వచ్చేవి. అయితే స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఏజె న్సీ ప్రాంతాల్లో వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంది. పీహెచ్సీల్లో వై ద్యులు, ఇతర సిబ్బందిని నియమించడంతో పాటు అన్ని రకాల మందులను దవాఖానల్లో అందుబాటులో ఉంచుతుం ది. దీంతో గత ఏడేళ్లలో ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధుల ప్రభావం కనిపించడం లేదు. ఏటా సీజన్ ప్రారంభంలోని అధికారులు వ్యాధుల నివారణకు ప్రణాళికలు తయా రు చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారి నుంచి గ్రామాల్లో పనిచేసే ఆ శ కార్యకర్తలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
పీహెచ్సీల్లో ఎపడమిక్ టీంలు
ప్రజలు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతుండగా వానకా లం ప్రారంభంకావడంతో వైద్యశాఖ అధికారులు సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీజన్లో ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వీటి నివారణకు గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 31 ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ప్రతి పీహెచ్సీలో ఎకాడమిక్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో డాక్టర్, హెచ్ఈవో, సూపర్వైజర్ ఉంటారు. వీరు గ్రామాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలిన వెంటనే అక్కడికి చేరుకొని వైద్యసేవలు అందిస్తారు. అవసమరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ దవాఖానకు తరలిస్తారు. గ్రామాల్లో ని ఆశ కార్యకర్తల వద్ద అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. వీరు ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని అవసరమైన వారికి మందులు ఇస్తారు.
సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు
వానకాలం సీజన్ ప్రారంభమైనందున ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు కలుషిత నీరు, ఆహారం వల్ల వచ్చే డయేరియా, ఇతర వ్యాధుల వచ్చే ప్రమాదం ఉంది. వీటి నివారణకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎపడమిక్ టీంలు 24 గంట లు అందుబాటులో ఉంటూ వ్యాధులు ప్రబలిన గ్రామా ల్లో వైద్య సేవలు అందిస్తారు.
కుడ్మిత మనోహర్,
ఏజెన్సీ అదనపు వైద్యాధికారి, ఆదిలాబాద్