న్యూఢిల్లీ, జూన్ 11: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ రూ.1,036.32 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,532.18 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.5,166.64 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికి రూ.7,245.16 కోట్లకు ఎగబాకింది. గతేడాది మొత్తానికి రూ.17,657.11 కోట్ల ఆదాయంపై రూ.2,699.70 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్తో కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది.