సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్కు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినట్టు ఎల్అండ్టీ మెట్రో ఎం.డీ కేవీబీ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ను దశల వారీగా సడలిస్తుండటంతో మెట్రో రాక పోకల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. జూన్ 10 నుంచి 10 రోజుల పాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు చివరి మెట్రో రైలు ప్రారంభమై చివరి స్టేషన్కు 5.45గంటల వరకు చేరుకుంటుంది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ మెట్రో రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. పది రోజుల పాటు పగటి పూట ఇచ్చిన సడలింపుతో ఏకంగా 10.30 గంటల పాటు హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైళ్లు నగర వాసులకు అందుబాటులో ఉండనున్నాయి.