న్యూఢిల్లీ: భారత పారా షట్లర్లు ప్రమోద్ భగత్ (ఎస్ఎల్-3), తరుణ్ (ఎస్ఎల్-4), నాగర్ కృష్ణ (ఎస్హెచ్-6) పారాలింపిక్స్కు అర్హత సాధించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగనున్న మెగాటోర్నీకి ఇప్పటికే మహిళల విభాగం నుంచి పాలక్ కోహ్లీ-పరుల్ జంట మెగాటోర్నీకి అర్హత సాధించగా.. తాజాగా ఆ జాబితాలో మరో ముగ్గురు చేరారు. టోక్యో పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ను తొలిసారి ప్రవేశ పెడుతుండగా.. భారత్ నుంచి మరింత మంది షట్లర్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి.