దుండిగల్,జూన్3:కరోనా పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు.నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి,1వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్థాని క ప్రజల సహకారంతో రూ.6లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ను గురువారం వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రణీత్ప్రణవ్ ఆంటీలియా కేంద్రంగా స్థానికులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను బాచుపల్లి పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన కార్పొరేటర్ విజయలక్ష్మితో పాటు స్థానికులను వారు అభినందించారు.అంబులెన్స్ నిర్వహణ బాధ్యతలను ‘సేవా భారతి ట్రస్ట్’కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.త్వరలోనే టోల్ఫ్రీ నంబర్ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజు,కార్పొరేటర్ ముదిరాజు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గోపాల్రెడ్డి,వెంకటసుబ్బారావు,స్థానికులు సురేశ్,వంశీ,శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.