భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ ఇంకా తీరాన్ని తాకకముందే ఒడిశా తీర ప్రాంతాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, కరెంటు స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఒడిశా తీరంలోని కేంద్రపాద ఏరియాలో భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.