బీజింగ్ : చైనా ప్రయోగించిన రోవర్ మార్స్ ఉపరితలంపై పనిచేయడం ప్రారంభించింది. మార్స్పై ల్యాండైన వారం రోజుల తర్వాత తన పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ రోవర్ అరుణగ్రహం ఉపరితలంపైన వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ రోవర్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది. అలాగే యంత్రంతో కూడా పనిచేస్తుంది. ఈ రోవర్ శనివారం తొలిసారిగా అంగారక గ్రహంపై దిగింది.
అధికారిక ఇంటర్నెట్ మీడియా పోస్ట్ ప్రకారం, చైనా సమయం ప్రకారం ఉదయం 10:40 గంటలకు మార్స్ ఉపరితలంపై ఈ రోవర్ ల్యాండింగ్ ప్రారంభమైంది. ఇది చంద్రునిపై ల్యాండింగ్ కంటే సాంకేతికంగా సవాలుగా ఉన్నది. యునైటెడ్ స్టేట్స్ తరువాత అలా చేసిన రెండవ దేశంగా చైనా రికార్డులకెక్కింది.
చైనా తన మొదటి మిషన్లో మార్స్ మీద ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. రోవర్కు పౌరాణిక చైనీస్ దేవత పేరు మీద జురాంగ్ అని పేరు పెట్టారు.
240 కిలోల జురాంగ్లో ఆరు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. ఇది అధిక రిజల్యూషన్ టోపోగ్రఫీ కెమెరాను కలిగి ఉన్నది. ఇది మార్స్ ఉపరితలంపై ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. సౌరశక్తితో పనిచేసే జురాంగ్ జీవితం పురాతన సంకేతాలను కూడా చూస్తుంది. ఇది దాదాపు మూడు నెలలు సమయం పాటు సేవలందించనున్నది.
2020 జూలై 23 న చైనా టియాన్వెన్ -1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. సౌర వ్యవస్థలో మరొక గ్రహం వైపు చైనా వేసిన మొదటి అడుగు దీనిని చెప్పుకోవచ్చు.
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..