న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానె అరుణాచల్ప్రదేశ్లోని చైనా సరిహద్దులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సైనిక సన్నద్ధత, ఈశాన్య రాష్ర్టాలలో భద్రతా వ్యవస్థపై సమీక్షించినట్టు అధికారులు తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దుల వెంబడి చైనా రోడ్లు తదితర నిర్మాణాలను చేపడుతున్న వార్తల నేపథ్యంలో నరవానె పర్యటన ప్రాముఖ్యత సంతరించుకున్నది.టిబెట్పై చైనా శ్వేతపత్రం విడుదల అరుణాచల్ను ఆనుకుని ఉన్న టిబెట్ సరిహద్దు గ్రామాల్లో రహదారి నిర్మాణాలు, మౌలిక వసతుల నిర్మాణాల వేగాన్ని పెంచినట్టు చైనా ఒక శ్వేతపత్రం విడుదల చేసింది.