ఆదిలాబాద్ : కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మల్ ఐఎంఏ, ఎన్డీఏ సంఘాలు సంయుక్తంగా వైద్య పరీక్షల రేట్లను తగ్గించాయి. హెచ్ఆర్సిటీ లంగ్స్ సిటీ స్కాన్ (HRCT lungs CT Scan) పరీక్షను 4,500 రూపాయల నుంచి రూ.2,500 కు తగ్గిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నిర్మల్ డాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు ఐఎంఏ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు.
లాభాపేక్ష లేకుండా ప్రజల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, రాంకిషన్ సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి