చైల్డ్లైన్ జిల్లా కమిటీ సభ్యుడు నాగరాజు
శాయంపేట, మే 18 : ఆపదలో ఉన్న బాలబాలికలకు అండ గా చైల్డ్లైన్ నంబర్ 1098 నిలుస్తుందని చైల్డ్లైన్ జిల్లా కమిటీ సభ్యుడు కోరుకొప్పుల నాగరాజు అన్నారు. మండలంలోని గోవిందాపూర్, శాయంపేట, కొత్తగట్టుసింగారం, పత్తిపాక గ్రా మాల్లో కరోనా సోకిన బాలల కుటుంబాలను గుర్తించి, మంగళవారం పౌష్టికాహారం సరుకులు, మాస్కులు, శానిటైజర్, హ్యాండ్వాష్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడడానికి, రక్షణ కోసం ఉచిత కాల్ నంబర్ను ఉపయోగించుకోవాలన్నారు. కరోనా బారిన పడిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సోకిన బాలల సమాచారం చెప్పిన వెంటనే స్పందించి సహాయం అందిస్తున్నామన్నారు. బాలబాలికలు ఎటువంటి ఆపదలో ఉన్నా 1098కి కాల్చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కో ఆర్డ్డినేటర్ వీరబాబు, చైల్డ్లైన్ జిల్లా సభ్యుడు హరీశ్, వలంటీర్ మారెపల్లి క్రాంతికుమార్ తదితరులున్నారు.
కరోనా సోకిన చిన్నారులకు చైల్డ్లైన్ చేయూత
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో సమాచారం తెలుసుకున్న చైల్డ్లైన్ ప్రతినిధులు వీరబాబు, మమత న్యూట్రిషన్, సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్ల్లలోపు చిన్నారులకు కరోనా సోకితే చైల్డ్లైన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాంబయ్య పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
ఖానాపురం: మండలంలోని ధర్మరావుపేట, బుధరావుపేట గ్రామాలలో కరోనా బారిన పడిన చిన్నారులకు చైల్డ్లైన్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైల్డ్లైన్ జిల్లా సభ్యుడు రమేశ్నాయక్ మాట్లాడుతూ చిన్నారులకు ఎలాంటి సహాయ సహాకారాలు కావాలన్నా 24 గంటలు చైల్డ్లైన్1098 అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, చైల్డ్లైన్ జిల్లా కో ఆర్డినేటర్ వీరబాబు, రోహన్, ఎల్లమ్మ, యశోద, రాని, మంజుల తదితరులు పాల్గొన్నారు.