శాలిగౌరారం, మే 18 : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. దీంతోపాటు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్ఓ కొండల్రావు, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్రెడ్డితో కలిసి మంగళవారం కొవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ టెస్టుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా అత్యవసర గదిని నిర్మిస్తానన్నారు. దవాఖానలో బెడ్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి కరోనా రహిత గ్రామాలుగా ఉండేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, వైస్ ఎంపీపీ కందుల అనిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపీటీసీ రాములుకు పరామర్శ
శాలిలింగోటం ఎంపీటీసీ పాక రాములును ఎమ్మెల్యే కిశోర్కుమార్ పరామర్శించారు. ఇటీవల మృతిచెందిన ఆయన తల్లిదండ్రుల నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, నాయకులు కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, శేఖర్బాబు, శంకర్, యాదయ్య, వేణుగోపాల్రెడ్డి, కృష్ణమూర్తి, లింగయ్య, కిష్టయ్య, సురేశ్రెడ్డి తదితరులు ఉన్నారు.
అన్నదాతలు ఆందోళన చెందొద్దు
ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆర్డీఓ జగదీశ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇబ్బందులను అధిగమించి ధాన్యాన్ని కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు. వైస్ చైర్మన్ శేఖర్బాబు, మార్కెట్ కార్యదర్శి వెంకట్రెడ్డి ఉన్నారు.