నిత్యం వెయ్యిమందికి ఉచిత భోజనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): హోం ఐసొలేషన్లో ఉంటున్న కరో నా బాధితులకు ఆర్యవైశ్య మహాసభ ఆపన్న హస్తమందిస్తున్నది. ప్రతిరోజూ వెయ్యిమందికి రెండునెలలపాటు ఉచితంగా ఆహారం అందించే కార్యక్రమాన్ని ఆదివారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో భోజనంతోపాటు డ్రైఫ్రూట్స్, పండ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. గతేడాది లాక్డౌన్లోనూ బాధితులకు అండగా ఉన్నామని గుర్తుచేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మ్యాడం దయాకర్ గుప్త, ఐసీసీ రెడ్డిశెట్టి చంద్రశేఖర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూన వెంకట గోపాలకృష్ణ, రవిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.