కరోనా కొత్త కేసులు 4,723
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికార్డుస్థాయిలో డిశ్చార్జీలు నమోదయ్యాయి. బుధవారం 5,695 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 4.49 లక్షలు దాటింది. రాష్ట్రంలో రికవరీ రేటు 87.89 శాతానికి పెరుగగా, జాతీయ సగటు 83 శాతానికి తగ్గింది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 5,695 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 745, రంగారెడ్డి జిల్లాలో 312, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 305, కరీంనగర్లో 219, వరంగల్ అర్బన్ లో 194 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 31 మంది మరణించారు.