ఉప్పల్, మే 11 : ప్రజల అవసరాలు గుర్తించి, ప్రజా సంక్షేమానికి చేయూతనందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్కు చెందిన రామంతాచారికి రూ.23 వేలు, ఉపేంద్రకు రూ.40 వేలు, చంటికి రూ.34,500ల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్రెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, సూరం శంకర్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, మే 11 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. మీర్పేట్ -హెచ్బీకాలనీ డివిజన్కు చెందిన పి. అంజయ్యకు 32 వేలు, మణికాంత్కు 60 వేలు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డి, నాయకులు వేముల సంతోశ్, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.