సికింద్రాబాద్, మే 11 : ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని, లాక్డౌన్లో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కరోనా వచ్చినవారికి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగానే ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా గతంలో కంటే మరిన్నీ సిలిండర్లను సమకూర్చుకున్నామని, కరోనా కాలంలో ప్రజలకు నిత్యం అండగా ఉంటామని తెలిపారు. మంగళవారం అడ్డగుట్టకు చెందిన కరోనా వ్యక్తికి ఆక్సిజన్ సిలిండర్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా కరోనా వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమవంతు సహకారంగా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తూనే ఉంటామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.