శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీగా గ్రెనేడ్లు పట్టుబడ్డాయి. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు ఆదివారం ఉదయం పూంచ్ జిల్లాలో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫాగ్లా ఏరియాలో వారికి అనుమానాస్పదంగా ఓ బస్తా కనబడింది. ఆ బస్తాను తెరిచి చూడగా అందులో గ్రేనేడ్లు కనిపించాయి. సంచిలో మొత్తం 19 గ్రెనేడ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిని సీజ్ చేశారు. ఉగ్రవాదులు విధ్వంసం సృష్టండం కోసం ఈ గ్రెనేడ్లను దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.