యాదాద్రి భువనగిరి : సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం జిల్లాలోని రామన్నపేట మండల కేంద్రంలోని మదీనా మసీద్ ఆవరణలో ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తోఫా(గిఫ్ట్ )ప్యాక్ లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.
షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ దేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమానంగా గౌరవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని మతాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు
కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, స్థానిక సర్పంచ్ గోదాసు శిరీషా, ఎంపీటీసీలు గొరిగే నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది