టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..సోషల్ మీడియా వేదికగా పూరీ మ్యూజింగ్స్ ద్వారా జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తారని తెలిసిందే. తాజా మరో అంశాన్ని ప్రస్తావించారు పూరీ. బంధాలు, అనుబంధాలు, సమాజం, ప్రకృతి, టాలెంట్ వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా మినిమలిజం గురించి మాట్లాడారు. మినిమలిజం అంటే అనవసరమైన దాన్ని దూరం పెట్టడం, దీన్నే సింప్లిసిటీ అని కూడా అనొచ్చు.
మినిమలిజం ఫాలో అయ్యే వాళ్లని చూస్తే కావాల్సిన దాన్ని మాత్రమే వాళ్లు తమ దగ్గర ఉంచుకుంటారు. వాళ్లింట్లో కూడా కావాల్సిన వస్తువులే ఉంటాయి. బీరువాలో ఏడు జతల దుస్తులు మాత్రమే ఉంటాయి. కానీ మన ఇండ్లల్లో బీరువా తెరవగానే గుట్టలు గుట్టలుగా దుస్తులు వచ్చిక కాళ్లపై పడిపోతాయి. సింపుల్గా బతకడం మనకు రాదు. మినిమలిస్ట్ దగ్గర ఒక ఫోన్ ఉంటే అది పనిచేసినంత కాలం దాన్నే వాడతాడు. మినిమలిస్టులకు పనోళ్లు ఉండరు. దొరికింది కదా అని ఊరంతా అప్పులు చేయరని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా