చెన్నై: తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చెన్నై నగరంపై డీఎంకే పార్టీకే పట్టు ఎక్కువ. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతున్నది. రాష్ట్రమంతటా తిరిగి పుంజుకోడంతోపాటే చెన్నై నగరంలోనూ డీఎంకే తన పట్టు నిలుపుకున్నది. నగరంలోని మొత్తం 16 సీట్లకుగాను 15 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారని, అధికార అన్నాడీఎంకేకు చెన్నై సిటీలో ఏ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత లేదు.
కాగా, చెన్నై నగరంలో అన్ని పార్టీలు ఉద్దండులను రంగంలోకి దించాయి. డీఎంకే తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నేత ఎజిలాన్ రంగంలో ఉండగా, డీఎంకే నుంచి కుష్బూ, అన్నాడీఎంకే నుంచి డీ జయకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ నటరాజ్ బరిలో నిలిచారు. వీరిలో డీఎంకే తరఫున బరిలో నిలిచిన వారు తప్ప మిగతా అందరూ వెనుకంజలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
‘తిరుపతి’లో 70 వేల ఆధిక్యంలో వైసీపీ
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ