నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు సాధించే దిశగా వెళ్తోంది. అధికార టీఎంసీకి గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం టీఎంసీ 130, బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.