రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్జీ వెంకటేశ్ను ఆలయ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇతని స్థానంలో జూనియర్ అసిస్టెంట్ సురేశ్ను అధికారులు నియమించారు. విచారణ కమిటీ నివేదిక అనంతరం వెంకటేశ్పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
లడ్డూ అమ్మకాల్లో వెంకటేశ్ దొంగ లెక్కలు చూపి 2 లక్షల లడ్డూలకు సంబంధించి రూ. 40 లక్షలు కాజేసినట్లుగా ఆరోపణ. డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా సమాచారం. ప్రసాదం తయారీ విభాగం క్రాస్ చెక్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కౌంటర్లో లడ్డూల స్టాక్ లేనప్పటికీ 2 లక్షల లడ్డూలు ఉన్నట్లుగా సదరు ఉద్యోగి పేర్కొంటూ తప్పుడూ లెక్కలు సృష్టించాడు.