వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ్య
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 21: విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలంటే వివిధ రకాల శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ్య అన్నారు. హైదరాబాద్లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పాలమూరు విద్యార్థులు ఆశ్విని హంసిని శ్రీవర్ధన్ వైనతేయాలు బచుపన్ ప్రయాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్నగర్లోని ఏనుగొండలో నిర్వహిస్తున్న రెడ్క్రాస్ అనాథాశ్రమంలో విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ నైపుణ్య శిబిరాన్ని రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన వ్యక్తిత్వ వికాస నిపుణుడు బాలలింగయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాషా, వృత్తి, జీవన విధానం, సాంకేతికపరమైన నైపుణ్యాలు, మెలకువలు పెంపొందించుకోవాలని కోరారు. చిన్నతనం నుంచే నీతి, నిజాయితీని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్ రెడ్క్రాస్ సమన్వయకర్త చంద్రశేఖర్, కృష్ణయ్య, మణిమాల, దీప్తి, జయంత్, విద్యార్థులు పాల్గొన్నారు.