జనగామ రూరల్, ఏప్రిల్ 20: కరోనా నియంత్రణకు అన్ని చర్య లు తీసుకుంటున్నామని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఆమె పారిశుధ్య సిబ్బందితో పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా జ మున మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని కోరారు. కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
మున్సిపల్ షాపుల వేలం
మున్సిపాలిటీకి చెందిన షాపుల బహిరంగ వేలాన్ని మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన నిర్వహించామని కమిషనర్ నర్సిం హ తెలిపారు. ఈ వేలంలో సింగిల్ టెండర్ వేసిన దరఖాస్తులను రద్దు చేశామని వివరించారు. సీపీఎస్ స్కూల్ పక్కన ఉన్న 28 నంబర్ షాపును సంతోష్ దక్కించుకున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.