రంగారెడ్డి : జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు గిరిజన మహిళా కూలీలుగా సమాచారం. కూలీ పనుల నుండి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై వెనుక నుండి వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నందిగామ మండల కేంద్రం సమీపంలోని తండాకు చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.