కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వ బర్దమాన్ సభలో ప్రసంగించిన షా.. బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్ను విశ్వాస్, వికాస్, వ్యాపార్ దిశగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు.
మమతా బెనర్జీ కేవలం మోదీని ఆడిపోసుకోవడానికి, భద్రతా బలగాలకు శాపనార్దాలు పెట్టడానికే తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఎజెండా ఆమె వద్ద లేదని ఆరోపించారు. దీదీ 12 నిమిషాలు మాట్లాడితే అందులో పది నిమిషాలు మోదీని, తనను విమర్శించడానికి, మరో 2 నిమిషాలు బలగాలను ఆడిపోసుకోవడానికి కేటాయిస్తున్నారని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో