నయీంనగర్, ఏప్రిల్ 10 : అన్ని వర్గాలకూ టీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా ఉందని ప్రభుత్వ చీఫ్విప్ దా స్యం వినయ్భాస్కర్ అన్నారు. హన్మకొండ రాంనగర్లో శనివారం హన్మకొండ, కాజీపేట మండలాల పరిధిలోని 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమ లు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఆయన కోరారు. కాగా, హన్మకొం డ రాంనగర్లోని ఏబీకే మాల్ నుంచి హన్మకొండ చౌర స్తా వరకు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న బైక్ ర్యాలీని చీఫ్విప్ వినయ్భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న మంత్రి కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్లో అభివృద్ధి పనులను కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బొర్ర ఐలయ్య, శివశంకర్ పాల్గొన్నారు.
యూపీహెచ్సీలో తనిఖీ
సుబేదారి : హన్మకొండ ఎన్జీవోస్కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చీఫ్విప్ వినయ్భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ టీకా వేసుకోవడానికి వచ్చిన స్థానికులను అక్కడి సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. కరంట్ సమస్య ఉందని సిబ్బంది తెలుపడంతో వెంటనే విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. అలాగే, కొవిడ్ వ్యాక్సిన్ కోసం మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయాలని ఫోన్ ద్వా రా గ్రేటర్ కమిషనర్కు సూచించారు. కాగా, వడ్డేపల్లి మున్నూరుకాపు సం ఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న సన్మాన కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా చీఫ్విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ తాను పుట్టిన గడ్డ వడ్డేపల్లికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. కుల సంఘానికి స్థలం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ము న్నురుకాపు సంఘం నాయకులు మధుసూదన్, ప్రసాద్, నవీన్
ఇవి కూడా చదవండి
ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు
రైనా ఈజ్ బ్యాక్..మెరుపు అర్ధశతకం